పాటశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం తొలిసారిగా పాటశాలలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయులు మంచి సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ సంక్రాంతి ఉత్సవాల్లో విద్యార్ధులతో చక్కని కార్యక్రమాలు చేయించారు. ముఖ్యంగా తెలుగు వారి సంప్రదాయమైన ముగ్గుల పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహం నింపారు. ఆ తరువాత సంక్రాంతి పండుగ సందర్బంగా సాంప్రదాయ బద్ధంగా చిన్నారి పిల్లలకు చేసే భోగి పళ్ళు పోసే కార్యక్రమం జరిగింది.
![]() |
| సాక్షి పత్రికలో మన పాటశాల వార్తా కథనం |
![]() |
| ఈనాడు పత్రికలో మన పాటశాల వార్తా కథనం |


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి